2 కిలో గంజాయి స్వాధీనం... యువకులు అరెస్ట్

2 కిలో గంజాయి స్వాధీనం... యువకులు అరెస్ట్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు  పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ బైక్ , 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.లోకేష్, సాయి శంకర్, మధు మోహన్, కిరణ్ మోహన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.