లోటస్ పాండ్ లో షర్మిల దీక్షకు అనుమతి నిరాకరణ

లోటస్ పాండ్ లో షర్మిల దీక్షకు అనుమతి నిరాకరణ

సీఎం కేసీఆర్ రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేసీఆర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ.. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర ఇవాళ(శనివారం) ఉదయం వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. ఆ తర్వాత  సాయంత్రం 6 గంటల నుంచి లోటస్ పాండ్ లోని తన ఇంటి దగ్గర వైఎస్ షర్మిల దీక్ష చేయాలని నిర్ణయించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అయితే  దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్ ను తొలగించారు. రెసిడెన్షియల్ ఏరియాలో దీక్షకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు.