ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీలపై రివార్డు

ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీలపై రివార్డు

గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీల పై రివార్డు ప్రకటించారు పోలీసులు. జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురు నేరస్థులు మంగ‌లి సోమ సుందర్, ప‌ర్వ‌తం నరసింహ, ఎమ్‌డీ అబ్దుల్ అర్భాజ్, ఎమ్‌డీ జావిద్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసు అధికారులు వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే గురువారం నాడు గాంధీ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డ్ నుండి బాత్రూం కిటికీ ద్వారా నిందితులు నలుగురూ పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు తప్పించుకుపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

అయితే తప్పించుకుపోయిన నేరస్థుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామ‌ని , వారి ఫోటోల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు పోలీసులు. ఆచూకీ తెలిపిన‌ వారి వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.