హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR

హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR

శరీర ధారుడ్యం అంటే ఫిట్నెస్ పెంచుకునేందుకు ప్రోటీన్ సప్లిమెంట్లు వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. పెద్ద మొత్తంలో ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం వల్ల ఎము కలలోని ఖనిజాలు నష్టపోతారని, కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. 

ప్రోటీన్ సప్లిమెంట్లు ఫౌడర్లను వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా అధ్యయనంలో తేల్చింది. ఫుడ్ లేబుళ్లపై సమాచారం చదివి వాటిని వినియోగించడం సరికాదని చెపుతోంది. పండ్లు, కూరగాయల వంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవాలని సూచిస్తోంది. ఉప్పు తక్కువగా తినడం, చక్కెర, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లను తగ్గించాలని చెబుతోంది. 

ఐసీఎంఆర్ రిపోర్టు ప్రకారం..మొత్తం శక్తి వినియోగంలో చక్కెర 5 శాతం కంటే తక్కువగా ఉండాలంట. తృణధాన్యాలు, మిల్లెట్ల నుంచి 45 శాతం కంటే ఎక్కువ కేలరీలు, పప్పులు, బీన్స్, మాంసం నుంచి 15 శాతం కేలరీల శక్తిని అందించాలి. 30 శాతం శక్తి గింజలు, కూరగాయలు, పండ్లు, పాల నుంచి అందేలా ప్లాన్ చేసుకోవాలి. మిగిలిన కేలరీల శక్తి కొవ్వులనుంచి వచ్చేలా డైట్ మెయింటెన్ చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. 

అవసరమైన పోషకాలను తక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది మరియు చిన్న వయస్సు నుండి ఇన్సులిన్ నిరోధకత మరియు సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమ కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) మరియు హైపర్‌టెన్షన్ (HTN) యొక్క గణనీయమైన నిష్పత్తిని తగ్గిస్తుంది మరియు టైప్ 2 డయాబెటిస్‌ను 80 శాతం వరకు నివారిస్తుంది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్‌లో సంస్థ ఆహార మార్గదర్శకాలను అప్‌డేట్ చేసింది. సాధారణ ప్రజలు, అథ్లెట్లకు ప్రోటీన్ సప్లిమెంట్ల వినియోగానికి సంబంధించి పలు హెచ్చరికలు చేసింది. తరచుగా పౌడర్ల రూపంలో లభించే ప్రోటీన్ సప్లిమెంట్లు గుడ్లు, పాల పాలు, పాలవిరుగుడు, సోయాబీన్స్, బఠానీలు, బియ్యం వంటి వివిధ వనరుల నుంచి వచ్చినా..వాటిలో చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, సువాసనలను కలిగి ఉండవచ్చు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించింది.