ఎయిర్ పోర్టులో  చైన్ స్నాచర్ అరెస్ట్

ఎయిర్ పోర్టులో  చైన్ స్నాచర్ అరెస్ట్
  • ఢిల్లీ నుంచి వచ్చి చోరీలు చేసి వెళ్తుండగా పట్టివేత

శంషాబాద్, వెలుగు: ఢిల్లీ నుంచి సిటీకొచ్చి దొంగతనాలు చేసి దర్జాగా ఫ్లైట్​లో పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని శంషాబాద్​ఎయిర్​పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ​జోన్ ​డీసీపీ జగదీశ్వర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్​కు చెందిన హేమంత్​ కుమార్ గుప్తా(30) కొన్నాళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాడు. ఏదో ఒక పని మీద హైదరాబాద్​కు వచ్చినట్లు నటిస్తూ సిటీలోని పలుచోట్ల చోరీలకు చేశాడు. తర్వాత ఇక్కడి పోలీసులకు చిక్కకుండా ఢిల్లీకి పారిపోతున్నాడు. ఇటీవల మరోసారి సిటీకొచ్చిన హేమంత్ కుమార్ మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమల(55) అనే మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుని పరారయ్యాడు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకున్న అతడిని పోలీసులు అరెస్ట్​చేశారు. 4 తులాల పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించారు.