వికారాబాద్ లో 9 క్వింటాళ్ల నకిలీ టీ పౌడర్ స్వాధీనం

వికారాబాద్ లో 9 క్వింటాళ్ల నకిలీ టీ పౌడర్ స్వాధీనం

రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ టీ పౌడర్ ముఠా కలకలం రేపుతోంది. ఇటీవల సూర్యపేటలో ముఠా నుంచి 45 క్వింటాళ్లకు పైగా నకిలీ టీ పౌడర్ ను పట్టుకున్న పోలీసులు లేటస్ట్ గా వికారాబాద్ పరిగిలో  9 క్వింటాళ్ల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. పరిగి ఇందిరా నగర్ లో  శ్రీనివాస్ అనే వ్యక్తి  ఇంట్లో సోదాలు చేయగా.. టీ పౌడర్ ను పట్టుకున్నారు.  స్థానికంగా ఇడ్లీలు అమ్ముతుండే శ్రీనివాస్.. దాంతో పాటు గ్రామాల్లో నఖిలి టీ పొడి అమ్ముతున్నాడు.  ఈ నఖిలి టీ పొడిని షాద్ నగర్ లోని మరో ముఠా నుంచి సేకరించి పరిగిలోని  ఇంట్లో దాచి శ్రీనివాస్  గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు టీ పొడి సరఫరా చేసే ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు.