రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసులు

రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసులు

హైదరాబాద్: రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులపై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా రాజ్ భవన్ ముట్టడికి యత్నించారని, ఈ క్రమంలో జనజీవనానికి అంతరాయం కలిగించారని పోలీసులు వారిపై అభియోగం మోపారు. ఆందోళన పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు కేసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 13 సెక్షన్ల కింద కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.