కోటి రూపాయల గంజాయి సీజ్.. నలుగురి అరెస్ట్

కోటి రూపాయల గంజాయి సీజ్.. నలుగురి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా సదాశివపేట దగ్గర భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. లారీలో తరలిస్తున్న 992 కేజీల గంజాయిని సీజ్ చేశారు. రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి తరలిస్తున్నారు. పట్టుకున్న గంజాయి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఈ గంజాయి తరలిస్తుండగా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. గంజాయిని ఆంధ్రా ఒడిశా బోర్డర్‌‌ నుంచి సేకరించినట్లు తమ ఎంక్వైరీలో తేలిందని పోలీసులు చెప్పారు. దీనిని రాజమండ్రిలో ప్యాకింగ్ చేసి, లారీలో లోడింగ్ చేసుకున్నారని అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో డెలివరీ చేసేందుకు తరలిస్తుండగా తమకు పక్కా సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఆ లారీని అడ్డగించి గంజాయిని సీజ్ చేశామన్నారు.