వికారాబాద్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు

వికారాబాద్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు

వికారబాద్ జిల్లా అంగడి చిట్టెంపల్లి మైనర్ బాలిక అత్యాచారం, హత్యను చేధించారు పోలీసులు. ప్రియుడే అంతకుడని తేల్చారు పోలీసులు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టిన వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి హత్య వివరాలను వెల్లడించారు. ఆయన  చెప్పిన వివరాల ప్రకారం..‘ ఈ నెల 28 న ఉదయం అంగడి చిట్టెంపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. ఇందుకోసం టీమ్స్  ఏర్పాటు చేసి.. 48 గంటల్లో నిందితుడిని గుర్తించాం. మహేందర్ అనే వ్యక్తి నేరానికి పాల్పడినట్లు..హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇద్దరికి  ఏడాది నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసింది. మృతురాలి చెల్లి ఈ విషయం ఇంట్లో చెప్పింది. దీంతో తల్లి మందలించింది. ఇక బయట కలుసుకోవడం కుదరదని భావించిన ఇద్దరు హత్యకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడుకున్నారు. ఇద్దరం బయట కలుద్దాం అని మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఉదయం మూడు గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. మృతురాలిని తనతో ఫిజికల్ గా కలవాలి అంటూ మహేందర్ బలవంత పెట్టాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించింది..దీంతో మహేందర్ కు ఆమెకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బాలికను తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకింది. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది. అది గమనించకుండా మహేందర్ ఆమెపై హత్యాచారం చేశాడు.  అత్యాచారం అనంతరం  బాలికను అక్కడే  వదిలేసి వెళ్ళిపోయాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరు పరుస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా త్వరగా శిక్ష పడేలా చూస్తామని’ అన్నారు.