బెల్ట్​షాపులపై దాడి చేశారని మహిళలపై కేసులు..

బెల్ట్​షాపులపై దాడి చేశారని మహిళలపై కేసులు..
  • రాత్రి పది గంటల వరకు  స్టేషన్​లో నిర్బంధం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో మూడు బెల్ట్​షాపులపై దాడి చేసి మద్యం బాటిల్స్​ పగులగొట్టారంటూ పోలీసులు శుక్రవారం కొందరు మహిళలపై కేసులు నమోదు చేశారు. రాత్రి పది గంటల వరకు వారిని స్టేషన్​లో ఉంచారు. బీఆర్ఎస్​ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు తమను రాత్రి పొద్దుపోయే వరకు స్టేషన్​లో నిర్బంధించారని బాధిత మహిళలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిల్ల రాధిక ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ (ఊరురామకృష్ణాపూర్​కు వెళ్లే రూట్)లోని మూడు బెల్ట్ షాపుల్లోని లిక్కర్ బాటిల్స్​ను గుర్తించి పగులగొట్టారు. 

ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వాహకులు, మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. రాధికతో పాటు మహిళలపై బెల్ట్ షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళలను అరెస్టు చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు. రాత్రి పది గంటల వరకు వారిని స్టేషన్​లోనే ఉంచారు. ఆ తర్వాత మహిళలపై కేసు నమోదు చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వీటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో బెల్ట్​షాపులపై దాడి చేసి మద్యం బాటిల్స్​ పగులగొట్టారంటూ పోలీసులు మహిళలపై కేసులు నమోదు చేశారు. రాత్రి పది గంటల వరకు స్టేషన్​లో ఉంచారు. 
బెల్ట్​షాపులపై దాడి చేశారని మహిళలపై కేసులు