హైదరాబాద్ లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్ లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్​, వెలుగు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోపోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,46,350  రూపాయల విలువైన వస్తువులు సీజ్‌‌‌‌ చేయడంతో పాటు 9.11లీటర్ల అక్రమ మద్యాన్ని  పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి  ఎస్ఎస్​టీ, ఎష్​ఎస్​టీ బృందాలు,  పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఉదయం ఒక టీమ్, రాత్రి మరొక టీమ్ ఇలా రెండు టీమ్ లను ప్రస్తుతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే నియోజకవర్గానికి మరొక టీమ్ మొత్తం3 టీమ్ లు, 3 షిఫ్ట్ లలో 24  గంటల పాటు తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.