రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వండి!

రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వండి!

హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. నిన్న అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనను విచారించడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అరెస్టుల సంఖ్య కూడా పెరుగుతుందని సమాచారం. 

ఇదిలా ఉండగా ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుతపన్నలను పోలీసులు రెండో రోజైన శనివారమూ విచారిస్తున్నారు. వారి స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేస్తున్నారు. రాధా కిషన్ ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా మరో ఇద్దరి  ప్రవేయంపైనా ఆరా తీసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఎవరా ఇద్దరు..? ఫోన్ల ట్యాపింగ్ లో వాళ్ల రోల్ ఏమిటి అన్నది త్వరలోనే తేలనుంది.