ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్

ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్

బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈస్ట్ జోన్ , అఫ్జల్ గంజ్ పోలీసులు సోమవారం రాత్రి గౌలిగూడ చౌరస్తాలో తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. గౌలిగూడకు చెందిన కుమార్ కు బేగం బజార్ లో కుమార్ జ్యువెలర్స్ షాప్ ఉంది. సోమవారం రాత్రి షాప్ మూసివేసి తన ఇంటికి వాహనంలో అతడు వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కుమార్ వద్ద బ్యాగులో రూ. 50 లక్షల నగదు గుర్తించారు. ఎలాంటి ఆధార పత్రాలు చూపకపోవడంతో  స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నగదును ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్టు ఇన్ స్పెక్టర్ లింగేశ్వర్ తెలిపారు.

ఎంజే మార్కెట్ చౌరస్తాలో రూ. 65 లక్షల పట్టివేత

అబిడ్స్  పోలీసులు  మంగళవారం రాత్రి ఎంజే మార్కెట్ చౌరస్తాలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యాపారి వద్ద రూ. 65 లక్షలు పట్టుబడ్డాయి. ఆ నగదుకు వ్యాపారి సంబంధిత పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేసి ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. నగదు తీసుకెళ్లే వ్యాపారి సమాచారాన్ని అబిడ్స్ పోలీసులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.