- ఎవరి లెక్కలు వాళ్లవే
- 86.18 శాతం భారీ పోలింగ్తో అంచనాలపై ఉత్కంఠ
- 2018 ఎన్నికలతో పోలిస్తే 0.28 శాతం తక్కువ
- బూత్ ల వారీగా పడ్డ ఓట్లపై పార్టీల కసరత్తు
నల్గొండ, వెలుగు: ఉత్కంఠభరితంగా సాగిన నాగార్జునసాగర్ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లెక్కలేసుకుంటున్నాయి. అభివృద్ధితోపాటు, భారీస్థాయిలో ప్రలోభాలకు గురిచేసిన అధికార పార్టీ గెలుపు తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వ వ్యతిరేకత, జానారెడ్డి ఇమేజ్పైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు బీజేపీ ఎస్టీ సామాజిక వర్గంపైనే ఫోకస్ పెట్టింది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యనే జరిగినప్పటికీ, బీజేపీ ప్రభావం ఏ పార్టీపై పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పైగా 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజీ కూడా పెరగలేదు. చాలా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్లో 2,20,206 మంది ఓటర్లు ఉండగా, 1,89,782 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ 86.18 శాతం నమోదైంది. 2018 అసెంబ్లీ ఎ న్నికల్లో 2,08,176 మంది ఓ టర్లు కాగా, 1,79,995 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ 86.46 శాతం నమోదైంది. 2018తో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్పర్సంటేజీ 0.28 శాతం మాత్రమే తగ్గింది. అయితే అప్పడు జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులతో కలిపి 14 మంది పోటీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రధాన పార్టీలతో కలిపి 41 మంది పోటీచేశారు. దీంతో ఓట్ల చీలిక ఏ పార్టీపై ప్రభావం చూపుతుందన్న దాని గురించే చర్చ జరుగుతోంది.
బూత్ల వారీగా లెక్కలు
మండల, గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏ గ్రామం తమకు అనుకూలంగా ఉంది? ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై పార్టీలు విశ్లేషిస్తున్నాయి. బైపోల్లో పార్టీలు తమ ఉద్దేశాన్ని ఓటర్లకు వివరించడంతోపాటు, భారీ స్థాయిలో ప్రలోభాలకు గురిచేశాయి. అయితే ఆ ప్రలోభాలు ఎక్కడ, ఏ విధంగా పనిచేశాయనే దాని మీద లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ తమకు అనుకూలంగా ఓటింగ్జరిగింది. ఎక్కడ ఇబ్బంది కలిగింది. ఏ కులాలు ఎటువైపు మొగ్గు చూపాయి, దీనికి కారణాలు.. ఇలా పలు కోణాల్లో గెలుపోటముల గురించి విశ్లేషణ చేస్తున్నారు. గుర్రంపోడు మండలంలో ఎస్టీలు బీజేపీకి మొగ్గు చూపడంతో టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందనే అంచనాతో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఉన్నారు. అదేవిధంగా హాలియా పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దీటుగా డబ్బులు పంచిపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రలోభాలు ఎంతవరకు పని చేశాయన్నదానిపై అభ్యర్థుల్లో చర్చలు జరుగుతున్నాయి.
సైలెంట్ ఓటింగ్..
పోలింగ్పర్సంటేజీని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల తరహాలో పోలింగ్ జరిగిందని ఎన్నికల ఆఫీసర్లు చెప్తున్నారు. ఏడు మండలాల్లో కూడా 77 శాతం నుంచి 93 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓటర్లు తమవైపే ఉన్నారని టీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. కానీ సైలెంట్ఓటింగ్జరిగిందని కాంగ్రెస్అంచనా వేస్తోంది. పోలింగ్కేంద్రాల్లో మూడేసి ఈవీఎంలు ఉండటం, ఈవీఎంలో ఐదో సింబల్ట్రక్కు గుర్తు ఉండటం, 37 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండటం వంటి అంశాలు తమకు కలిసొస్తాయనే ధీమాతో ఉన్నారు. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు చాలా వరకు క్రాస్ ఓటింగ్పాల్పడ్డారని చెప్తున్నారు. దీని వల్ల కొంతమేర టీఆర్ఎస్కు నష్టం జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ ఆ ప్రభావం మెజార్టీపైనే చూపుతుంది తప్ప గెలుపోటములు డిసైడ్చేయదని ఆ పార్టీ సీనియర్లీడర్ఒకరు చెప్పారు. ఎస్టీ ఓటర్ల పైనే ఫుల్ఫోకస్పెట్టిన బీజేపీ ఏ మేరకు ఓటు బ్యాంకు సాధిస్తుందనే దాని గురించి కూడా పార్టీ లీడర్లు మండలాల వారీగా లెక్కలు తీస్తున్నారు. బీజేపీ చీల్చే ఓట్లు రెండు పార్టీల్లో దేనిపైన ప్రభావం చూపుతుందనేది దాని గురించి కూడా చర్చ జరుగుతోంది.