బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య

బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. జనగామలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పొన్నాలతో పాటుగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ..  45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యానని చెప్పారు. 

కేసీఆర్ సీఎం అయ్యాక 3 నెలలకే రాష్ట్రంలో సకలజనుల సర్వే పేరుతో కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని,  కేసీఆర్ మూడోసారి సీఎం ఖావడం ఖాయమని పొన్నాల చెప్పారు.  కాగా పొన్నాల ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.