అబద్ధాలు ప్రచారం చేయడంలో బండి సంజయ్ ఆరితేరిండు

 అబద్ధాలు ప్రచారం చేయడంలో బండి సంజయ్ ఆరితేరిండు

తెలంగాణలోని బీజేపీ నేతలు డీఎన్ఏ టెస్టు చేసుకోవాలని కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై పొన్నం ఫైర్ అయ్యారు. జగిత్యాల, వరంగల్ ఫోర్ లైన్స్ రోడ్డును 2016లో కేంద్రంలోని బీజేపీ ఫ్రభుత్వం చేసిందని కిషన్ రెడ్డి చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు.

చేసింది చెప్పుకుంటే బాధలేదు కానీ.. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను తాము చేసినట్టు చెప్పడం సిగ్గుచేటని పొన్నం అన్నారు. 2014లో తాను ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒప్పించి జగిత్యాల, వరంగల్ రోడ్డుకు నిధులు తెచ్చానన్నారు. కిషన్ రెడ్డి  తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్న పొన్నం.. తెలంగాణను అవమానపరిచిన పార్టీ బీజేపీ అని అన్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన  హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బండి సంజయ్ నెంబర్2 బాతాల పోశెట్టిగా తయారయ్యాడని,  రౌడీలా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆరితేరాడంటూ సంజయ్ పై పొన్నం విమర్శలు చేశారు.