బీబీసీ మీడియా సంస్థలపై ఐటీ దాడులెందుకు : పొన్నం ప్రభాకర్

బీబీసీ మీడియా సంస్థలపై ఐటీ దాడులెందుకు : పొన్నం ప్రభాకర్

ప్రధాని మోడీ ఓ నియంత అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అదానీ వ్యవహారం పై మోడీ పార్లమెంట్‭లో మాట్లాడకపోవడం దారుణమన్నారు. బీబీసీ మీడియా సంస్థలపై ఐటీ దాడులు చేయడం హేయమైన చర్య అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న నేతలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. సందర్బం వచ్చిన ప్రతిసారి 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. కరెంటు తీగలు పట్టుకునేందుకు తాము రెడీగా ఉన్నామని.. దమ్ముంటే మీరు రెడీగా ఉన్నారా అంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. 

వేములవాడ రాజన్నకు కేసీఆర్ శఠగోపం పెట్టాడని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. అసలు శ్రీరాంసాగర్ నీళ్లు మహారాష్ట్రకు ఎలా తీసుకెళ్తారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.  ఇక కాంగ్రెస్‭లో నాయకులకు సమన్వయం అవసరమని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని పొన్నం ప్రభాకర్ చెప్పారు.