సిల్వర్తో సరిపెట్టిన మేరీకోమ్
లాల్బువసైహి, అనుపమ కూడా
నేడు మెన్స్ ఫైనల్స్
ఇండియా బాక్సర్ పూజా రాణి గోల్డెన్ పంచ్ విసిరింది. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. ఆరో గోల్డ్ వేటలో లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఫెయిలైన చోట పూజా తన పంచ్ పవర్ చూపెట్టింది. తిరుగులేని పెర్ఫామెన్స్తో ప్రత్యర్థిని చిత్తు చేసి చాంపియన్గా నిలిచింది. మేరీతో పాటు ఫస్ట్ టైమ్ టోర్నీ బరిలో నిలిచిన యంగ్ బాక్సర్ లాల్బువసైహి, అనుపమ తమ ఫైనల్ బౌట్లలో ఓడి సిల్వర్ మెడల్స్తో తిరిగొచ్చారు.
దుబాయ్: ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ పూజా రాణి (75 కేజీ) మరోసారి మెప్పించింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. బై, వాకోవర్తో నేరుగా ఫైనల్కు వచ్చిన పూజ ఈ చాన్స్ను అద్భుతంగా ఒడిసిపట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన మల్వుడా మొవ్లొనోవాను 5-–0తో చిత్తు చేసి టోక్యో ఒలింపిక్స్కు ముందు కాన్ఫిడెన్స్ పెంచుకుంది. పూజా ధాటికి ప్రత్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సెమీస్లో లండన్ ఒలింపిక్స్ మెడలిస్ట్ వొల్నోవాను ఓడించి ఫైనల్కు వచ్చిన మల్ముడా.. ఇండియా బాక్సర్ స్పీడ్ను అందుకోలేక, పవర్ఫుల్ పంచ్లకు ఉక్కిరిబిక్కిరైంది. చాలా తెలివిగా ఆడిన పూజా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి క్రమం తప్పకుండా పంచ్లు కొట్టింది. దాంతో, మెగా టోర్నీలో వరుసగా రెండో గోల్డ్ ఓవరాల్గా నాలుగో మెడల్ కైవసం చేసుకుంది. 2019లో గోల్డ్, 2012లో సిల్వర్, 2015లో బ్రాంజ్ సాధించింది. ఇక, ఈ మెగా టోర్నీలో తొలిసారి పోటీ పడ్డ లాల్బువసైహి 64 కేజీ ఫైనల్ బౌట్లో 2-–3తో మిలానా సఫ్రోనోవా చేతిలో పోరాడి ఓడి సిల్వర్కు పరిమితం అయింది. 81+ కేజీ ఫైనల్లో అనుపమ 2-–3తో కజకిస్తాన్కు చెందిన లజాత్ కుంగెయిబ్ చేతిలో పోరాడి ఓడి సిల్వర్తో సరిపెట్టింది. ఈ టోర్నీలో గోల్డ్ మెడలిస్ట్లకు రూ.7.23 లక్షలు (10 వేల డాలర్లు), సిల్వర్ మెడిస్ట్లకు 3.61 లక్షలు (5 వేల డాలర్లు) ప్రైజ్మనీగా అందించారు. ఇక, సిమ్రన్జిత్(60 కేజీ), లవ్లీనా (69కేజీ), జాస్మిన్ (57 కేజీ), సాక్షి చౌదరి (64 కేజీ), మోనికా (48 కేజీ), సవీటి (81 కేజీ).. మెన్స్లో వికాస్ క్రిషన్ (69కేజీ), వరీందర్ సింగ్ (60 కేజీ) సెమీస్లో ఓడి ఇండియాకు ఎనిమిది బ్రాంజ్ మెడల్స్ అందించారు. వీళ్లకు ఒక్కొక్కరికి రూ.1.80 లక్షలు ప్రైజ్మనీగా దక్కింది. కాగా, సోమవారం జరిగే మెన్స్ ఫైనల్ బౌట్లలో అమిత్ పంగల్ (52 కేజీ), శివ థాపా (64 కేజీ), సంజీత్ (91 కేజీ) పోటీ పడతారు.
మేరీకి నిరాశ
51 కేజీ ఫైనల్ బౌట్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన మేరీకి షాక్ తగిలింది. వరల్డ్ చాంపియన్షిప్స్ మాదిరిగా ఏషియన్ ఈవెంట్లోనూ ఆరోసారి గోల్డ్ నెగ్గాలన్న ఆమె కలకు రెండు సార్లు వరల్డ్ చాంప్ నజిమ్ కిజయ్బై (కజకిస్తాన్) అడ్డొచ్చింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ ఫైట్లో నజిమ్ 3-–2తో మేరీని ఓడించింది. స్టార్టింగ్ నుంచే ఇద్దరూ దూకుడుగా ఆడారు. ఒకరిపై ఒకరు పంచ్లు కురిపించారు. క్రమంగా జోరు పెంచిన మేరీ.. తనకంటే 11 ఏళ్లు చిన్నదైన కజక్ బాక్సర్పై ఫస్ట్ రౌండ్లో పైచేయి సాధించింది. ఇక, రెండో రౌండ్లో ఇద్దరు బాక్సర్లు దూకుడు చూపెట్టారు. అయితే, పర్ఫెక్ట్ ల్యాండింగ్స్తో నజిమ్.. కీలక పాయింట్లు సాధించింది. చివరి రౌండ్లో మేరీకోమ్ పుంజుకునే ప్రయత్నం చేసినా జడ్జీలను మెప్పించలేకపోయింది. ఈ టోర్నీలో మేరీకోమ్కు ఇది ఏడో మెడల్. 2003లో తొలిసారి గోల్డ్ నెగ్గింది. ఓవరాల్గా ఐదు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించింది.