
ఎలక్ట్రిక్ కారు మకాన్ ఈవీని ఇండియన్ మార్కెట్లోకి పోర్షే తీసుకొచ్చింది. మకాన్ 4, మకాన్ టర్బో వేరియంట్లలో ఈ బండి అందుబాటులోకి రాగా, ఇండియాలో మకాన్ టర్బో వేరియంట్ను మాత్రమే కంపెనీ అమ్ముతోంది. ధర రూ. 1.65 కోట్లు (ఎక్స్షోరూమ్). బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో డెలివరీలు ఉంటాయి.