రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్

రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్

రాంలీల కమిటీ ఈసారి విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమానికి కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి పాన్​ ఇండియా హీరో ప్రభాస్  పాల్గొననున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ​ఇండియా సినిమా ​అదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో రావణ దహనానికి రాంలీల కమిటీ ప్రభాస్ ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా కోవిడ్ పరిస్థితుల్లో రావణ దహన కార్యక్రమాన్ని రాంలీల కమిటీ నిర్వహించలేకపోయింది. రెండేళ్ల తర్వాత ఈసారి ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్ తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రాన్ని బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రాలో నటిస్తుండగా.. సైఫ్‌ అలీ ఖాన్ రావణ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.