పంజాగుట్ట, వెలుగు : లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా భవన్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రజా భవన్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జూన్ 7వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా కొనసాగిస్తామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అప్పటివరకు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.