12 మందితో ప్రజా శాంతి పార్టీ లిస్ట్

12 మందితో ప్రజా శాంతి పార్టీ లిస్ట్

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బరిలో నిలిచి గెలుస్తామని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న 12 మంది అభ్యర్థుల లిస్ట్ ను సోమవారం ఆయన అమీర్ పేట్​లోని పార్టీ ఆఫీసులో విడుదల చేశారు. తర్వాత పాల్ మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో కేసీఆర్, కేటీఆర్ తనను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

కామారెడ్డిలో తాను పోటీ చేస్తానని ప్రకటించగానే ఆ నియోజకవర్గ రైతులను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిచి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాంగ్రెస్ కు వైఎస్సార్​టీపీ, టీజేఎస్ మద్దతు ఇస్తుందని తాను ముందే చెప్పానని, తన మద్దతు కోసం నిర్మాత బండ్ల గణేష్ తో రేవంత్ రెడ్డి అడిగించారన్నారు.