
పంజాగుట్ట,వెలుగు : బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మంగళవారం ప్రజావాణికి 607 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వాటిలో రెవెన్యూ 176, హౌసింగ్58, పౌరసరఫరాలకు 54, మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ , పట్టణాభివృద్ధి శాఖ 36, హోంశాఖ 62 , ఇతర శాఖలకు 221 విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించారు. ఫిర్యాదుల్లో ఎక్కువశాతం భూసమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజావాణిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ లో వ్యవసాయ భూమి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ 2 ఏండ్లుగా సర్వేయర్చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని బాధితుడు కాశబోయిన సమ్మయ్య యాదవ్ ఫిర్యాదు చేశాడు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్నాడని పలువురు ప్లకార్డులతో వచ్చి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే బాధితులు సుమారు 350 మంది ఉన్నారని, ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు.