పంజాగుట్ట, వెలుగు: విక్టిమ్ప్రొటెక్షన్ప్లాన్అక్రమ రవాణాకు గురైన మహిళలకు చేయూతనిస్తుందని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఫౌండర్సునితా కృష్ణన్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్రమ రవాణాకు గురైన పలువురు బాధితులతో కలిసి ఆమె మాట్లాడారు. విమెన్ట్రాఫికింగ్కు పాల్పడి, వారితో అసాంఘిక కార్యాకలాపాలు చేయించడం బాధాకరమన్నారు. బాధితులకు తక్షణ పరిహారం అందడం వల్ల వారు ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో గౌరవంగా జీవిస్తారని పేర్కొన్నారు. లోక్సభలో ఆమోదం పొందిన విక్టిమ్ప్రొటెక్షన్ ప్లాన్త్వరలోనే బిల్లుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
