అమెరికాలో ప్రకాశం జిల్లా వ్యక్తి దుర్మరణం

అమెరికాలో ప్రకాశం జిల్లా వ్యక్తి దుర్మరణం

ఆంధ్ర ప్రదేశ్  ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నూనె సురేశ్ అనే అతను అమెరికాలో సింతెల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శనివారం కుటుంబ సమేతంగా ఒక్లటం టర్నర్ జలపాతానికి హాలీడే ట్రిప్ కు వెళ్లాడు. ప్రమాద వశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. సురేష్ కు భార్య, ఒక కొడుకు, ఒక ఆడ బిడ్డ ఉన్నారు. చాలా కాలం క్రితమే సురేశ్ అమెరికాలో స్థిరపడినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. తెలుగు సంఘాలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత తొందరగా సురేశ్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబ సభ్యులు కోరారు.