
మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 120మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వైరస్ సోకినవారి సంఖ్య 869కి చేరింది. ఈనెల 4వ తారీఖున ముంబైలోని నల్లాసోపారాకు చెందిన 30ఏళ్ల గర్భవతి కరోనాతో మృతిచెందింది. సదరు గర్భవతికి శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో నాయర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెకు కరోనా ఉందని అనుమానించిన డాక్టర్లు… టెస్ట్ చేయడంతో ఆమెకు పాజిటీవ్ వచ్చింది. అయితే ఆమె ఆరోగ్యం క్షినించి మృతిచెందింది. ఈ విషయంపై పాల్గర్ కలెక్టర్ కైలాష్ షిండే మాట్లాడారు. సదరు గర్భిణీ వివరాలను సేకరిస్తున్నామని.. ఆమె కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయిస్తామని చెప్పారు.
మహారాష్ట్రలో కొత్తగా నమోదైన 120 కేసులలో 68కేసులు ముంబై, 41పూణే, మూడు ఔరంగాబాద్, వాసాయి – విహార్ లో ఒక్కోక్కటి, సతారా, అహ్మద్నగర్, జల్నా, నాసిక్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు చెప్పారు.
కరోనాతో మృతిచెందిన వారిలో 73శాతం మగవాళ్లు ఉన్నారు. మహిళలకన్నా ఎక్కువగా మగవారికే వ్యాధికి లోనయ్యే అవకాశమున్నట్లు డాక్టర్లు తెలిపారు. కరోనాకు గురైన వారిలో బీపీ, షుగర్తో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారిలోనే మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.