
నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్కు తెగ ఫిదా అవుతున్నారు యూత్. ముఖ్యంగా ఇందులో మమితా బజు హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది.
లేటెస్ట్గా ప్రేమలు సక్సెస్ మీట్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పందిస్తూ..'గీతాంజలి ఫేం గిరిజ, సాయి పల్లవి లానే మమిత కూడా యూత్ హార్ట్ త్రోబ్ అవుతుంది..అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు.
'ఫస్ట్ ప్రేమలు ట్రైలర్ చూసినప్పుడు నాకు మమితా చాలా నచ్చింది. ఆమెనే తర్వాత అందరి హృదయాలను మెలిపెడుతుందని అనిపించింది. గీతాంజలి సినిమాలో గిరిజ వచ్చినట్టు..ఆ తర్వాత సాయిపల్లవి వచ్చినట్టు. వాళ్లు ఎలాంటి ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేశారో మమితాకు కూడా అలాగే చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈమెపై మీరు ప్రేమ కురిపిచడం నేను చూస్తున్నా” అని రాజమౌళి చెప్పారు.
ప్రస్తుతం రాజమౌళి మాట్లాడిన మాటలు వైరల్ అవుతూనే..మామితా బజు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
ఈ కేరళ కుట్టీ మమితా బజు 2017లో ఓ మలయాళ మూవీ ద్వారా మాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ..కేరళ ప్రేక్షకులను ప్రతి క్యారెక్టర్ తో అలరించింది. అంతేకాదు తన యాక్టింగ్ కు గాను ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
టీనేజ్ గర్ల్ అయిన మామితా ఇప్పటి వరకు 16 సినిమాలు చేసి యూత్ లో క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు ప్రేమలు మూవీతోను తెలుగులో మంచి ఫ్యాన్ ఫాల్లోవింగ్ ని సొంతం చేసుకుంది.
రీసెంట్ గా మమితా బజు కోలీవుడ్ లో రెబల్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్ కు జోడీగా నటించింది. నికేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో పాటు విష్ణు విశాల్- రామ్ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో లీడ్ రోల్ పోషించనుంది. ఇప్పుడు తెలుగులో కూడా ప్రేమలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి..ఆఫర్లు అందుకుంటుంది.
అయితే, ఇప్పటికే కేరళ నుంచి సాయి పల్లవి, అనుపమ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. దీంతో మమితా బజు ఆచూతూచి మంచి కథలను ఎంచుకోవాలని సినీ వర్గాలు చెబుతున్నాయి.