ఎయిర్ వారియర్స్ దేశాన్ని గర్వించేలా చేశారు

ఎయిర్ వారియర్స్ దేశాన్ని గర్వించేలా చేశారు

ఘజియాబాద్: ఎయిర్ ఫోర్స్ 88వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ఘజియాబాద్, హిందోన్ ఎయిర్ బేస్‌‌లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎయిర్ వారియర్స్‌‌కు ప్రముఖులు విషెస్ చెప్పారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అభినందనలు తెలిపారు.

దేశ గగనతలాన్ని రక్షించడంలో ఐఏఎఫ్ అందించిన సేవలు అమోఘం అని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ అన్నారు.

మన ఎయిర్ వారియర్లు తమ ప్రొఫెషనలిజం, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి అని, వాళ్లు దేశం గర్వించేలా చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు.

దేశ గగనతలాన్ని సురక్షితంగా ఉంచడమే గాక విపత్తులు సంభవించినప్పుడు ఆదుకోవడంలోనూ భారతీయ వాయుసేన కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.