ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి... ముచ్చింతల్లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 120 కేజీల బంగారంతో రూపొందించిన రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరిగి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ప్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు బేగం పేట ఎయిర్ పోర్టులకు గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.