దేశాభివృద్ధి జరగాలంటే అంతర్గత రక్షణ ముఖ్యం

దేశాభివృద్ధి జరగాలంటే అంతర్గత రక్షణ ముఖ్యం

71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకున్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశాభివృద్ధి జరగాలంటే అంతర్గత రక్షణ ముఖ్యమన్నారు రాష్ట్రపతి. దీంతో పాటు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అంశాలను ప్రస్తావించారు. ఏదైనా విషయంపై పోరాడితే.. అహింసాపద్ధతుల్లోనే సాధించుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు వైద్య ఖర్చులను తగ్గించాయని చెప్పారు. అధికారం, దర్పం, డబ్బు కంటే జ్ఞానమే ముఖ్యమని నమ్మే దేశం మనది అని అందుకే విద్యావ్యాప్తి ముఖ్యమన్నారు.