రెడ్‌‌‌‌క్రాస్ వాలంటీర్లకు గవర్నర్ తమిళిసై సూచన

రెడ్‌‌‌‌క్రాస్ వాలంటీర్లకు గవర్నర్ తమిళిసై సూచన

హైదరాబాద్, వెలుగు: వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో టీబీని నివారించాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. టీబీ రోగులకు న్యూట్రీషన్ ఫుడ్ అందించే కార్యక్రమంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు ఇన్వాల్వ్ కావాలని సూచించారు. మంగళవారం రాజ్ భవన్‌‌‌‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల శాఖల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ జిల్లా శాఖలకు ఎన్నికలు జరిపి, మండల, డివిజన్ స్థాయిలో రెడ్ క్రాస్ శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్, యూత్ రెడ్ క్రాస్, యాక్టివ్ వాలంటీర్ల నమోదుకు జిల్లాల్లో ప్రత్యేక సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించి, డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ కాన్ఫరెన్సుల్లో పాల్గొంటానని గవర్నర్ తెలిపారు.