
హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం) పదోన్నతులను కేవలం టీటీసీ లేదా డీఎడ్ టీచర్లకు మాత్రమే కల్పించాలని తెలంగాణ టీటీసీ టీచర్స్ ఫోరమ్ డిమాండ్ చేసింది. ప్రమోషనల్ జాబితాను టీటీసీ టీచర్ల సీనియారిటీ ఆధారంగా తయారు చేయాలని ఆదివారం ఫోరం కన్వీనర్, కో కన్వీనర్ బి. మురళీధర్ గౌడ్, యం.శ్రవణ్ కుమార్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో అసెంబ్లీలో ప్రకటించినట్టు వెంటనే 10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.