ఎస్సీ వర్గీకరణపై మోదీ మీటింగ్

ఎస్సీ వర్గీకరణపై మోదీ మీటింగ్
  • కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయ నం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించా రు. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీ లో కీలక మీటింగ్ జరిగింది. దీనికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారు లు హాజరయ్యారు. 

ఈ మీటింగ్ లో ఎస్సీ వర్గీకరణపై అధికారులతో మోదీ చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుపై సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు మోదీ ఆదేశాలిచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘‘మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని ఆదేశాలు ఇచ్చారు” అని అందులో పేర్కొంది.