ఈశ్వరప్పకు ప్రధాని ఫోన్

ఈశ్వరప్పకు ప్రధాని ఫోన్

న్యూఢిల్లీ: బీజేపీ కర్నాటక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. పార్టీ నిర్ణయాన్ని ఆమోదించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విషయంలో ఆయన విధేయత, నిబద్ధతను మోడీ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈశ్వరప్ప రిలీజ్ చేశారు. అందులో ‘‘మీలాంటి నాయకుడు నాలాంటి సాధారణ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేయడం చాలా గొప్పగా అనిపిస్తున్నది’’ అని ప్రధానితో ఈశ్వరప్ప చెప్పడం వినిపించింది. ‘‘మీరు పార్టీ విషయంలో నిబద్ధతను ప్రదర్శించారు. చాలా సంతోషంగా అనిపించింది. అందుకే మీతో మాట్లాడాలని అనుకున్నాను’’ అని ప్రధాని చెప్పారు. కర్నాటక పర్యటనకు వచ్చినప్పుడు ఈశ్వరప్పను కలుస్తానని తెలిపారు. శివమొగ్గ నుంచి ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఈశ్వరప్ప గెలిచారు. అయితే ఆరోసారి పోటీ చేద్దామని భావించగా.. పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిగా నిలబడిన చన్నబసప్ప కోసం తాను ప్రచారం చేస్తానని ప్రధానికి ఈశ్వరప్ప చెప్పారు.