మిస్టర్ టైసన్

మిస్టర్ టైసన్

అటు హీరోగానూ, ఇటు దర్శకుడిగానూ కూడా సత్తా చాటుతున్నాడు మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టి సినిమా తీయబోతున్నాడు. ఇందులో తనే హీరోగానూ నటిస్తున్నాడు. ‘కేజీయఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తీసిన హోంబలే ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతోంది. ‘టైసన్’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఫిక్స్ చేశారు. ఇదో సీరియస్ డ్రామా. పృథ్విరాజ్ ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. ఇది అతను డైరెక్ట్ చేస్తున్న నాలుగో సినిమా. మొదట మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘లూసిఫర్’ తీశాడు. తర్వాత ఆయనతోనే ‘బ్రోడాడీ’ తీశాడు. ఈ రెండు చిత్రాల్లో పృథ్విరాజ్ కూడా నటించాడు. ఇక మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ తీస్తున్నాడు. ఇది పూర్తయ్యాక ‘టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ని పట్టాలెక్కించబోతున్నాడు. మంచి కాన్సెప్ట్స్ ఎంచుకుంటాడని పృథ్వికి పేరుంది. మరి ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడో చూడాలి. ఇక పృథ్విరాజ్ నటించిన రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. రెండు పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ఉన్నాయి. రెండు మూవీస్ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నాయి. వీటిలో కనీసం మూడు సినిమాలు ఈ యేడు రిలీజయ్యే అవకాశం ఉంది.