అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది : ప్రియాంక గాంధీ

అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది :  ప్రియాంక గాంధీ

అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. రాంలీలా మైదానం నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. దుర్మార్గుడైన రావణుడికి అనంతమైన సైన్యం, ధనం ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదని చెప్పారు. అలాగే రాజ్యాంగ సంస్థలను గుప్పిట పట్టిన మోదీకి కూడా పతనం తప్పదన్నారు ప్రియాంక గాంధీ.  

కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదే జరిగితే దేశంలో హింస చెలరేగి అగ్నిగుండంలా మారుతుందన్నారు. ఈవీఎంల ట్యాపరింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లు, మీడియాపై ఒత్తిడి లేకుంటే... బీజేపీకి 180 సీట్లు కూడా రావన్నారు. 

మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఢిల్లీలో మహా ర్యాలీ నిర్వహించాయి. రాంలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ఇండియా కూటమిలోని నేతలందరూ హాజరయ్యారు.