బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్కు ఫస్ట్ ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పుణెరి పల్టాన్ 34–33 తేడాతో టైటాన్స్పై గెలిచింది. లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టైటాన్స్ లాస్ట్ రైడ్ పాయింట్ సాధించలేకపోయింది. రైడింగ్లో సిద్దార్థ్ దేశాయ్ (15) అదరగొట్టాడు. సురీందర్ సింగ్ (2), అంకిత్ బెనివాల్ (2) ఫర్వాలేదనిపించారు. పుణె తరఫున కెప్టెన్ రాహుల్ చౌదరి (15), డిఫెండర్ అభినేశ్ (5) చెలరేగారు. అస్లామ్ 8 పాయింట్లతో అండగా నిలిచాడు. సెకండ్ మ్యాచ్లో యూపీ యోధా 36–35తో పట్నా పైరేట్స్పై గెలిచింది. మోనూ గోయత్ (5), ప్రశాంత్ కుమార్ (8), సచిన్ (10) పట్నాకు పాయింట్లు అందించారు. యూపీ టీమ్లో ప్రదీప్ నర్వాల్ (12), అషు సింగ్ (3), శ్రీకాంత్ జాదవ్ (3) ఓ మాదిరిగా ఆడారు. థర్డ్ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 40–38తో హర్యానా స్టీలర్స్కు చెక్ పెట్టింది. దీపక్ హుడా 10 పాయింట్లతో జైపూర్ విక్టరీలో కీ రోల్ పోషించాడు. అర్జున్ 5 పాయింట్లతో అండగా నిలిచాడు. హర్యానా టీమ్లో వికాస్ 14 పాయింట్లు తెచ్చినా టీమ్ను గెలిపించలేకపోయాడు.

