డిసెంబర్‌ లో ప్రొ కబడ్డీ లీగ్‌!

డిసెంబర్‌ లో ప్రొ కబడ్డీ లీగ్‌!

బెంగళూరులోనే మొత్తం మ్యాచ్‌‌‌‌లు..
హైదరాబాద్‌‌: కబడ్డీ ఆటగాళ్లు, అభిమానులకు గుడ్‌‌న్యూస్‌‌. ప్రొ కబడ్డీ లీగ్‌‌ హంగామా మళ్లీ మొదలవనుంది. కరోనా కారణంగా గతేడాది రద్దయిన పీకేఎల్‌‌ ఎనిమిదో సీజన్‌‌ తొందర్లోనే ఫ్యాన్స్‌‌ను కనువిందు చేయనుంది. ఈ మెగా లీగ్‌‌ డిసెంబర్‌‌ 22వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా ప్రొటోకాల్స్‌‌ నేపథ్యంలో సీజన్‌‌ మొత్తాన్ని బెంగళూరులోనే నిర్వహిస్తారని సమాచారం. అందుకోసం నగరంలోని కాంఠీవర ఇండోర్‌‌ స్టేడియంలో బయో బబుల్‌‌ క్రియేట్‌‌ చేస్తారని తెలుస్తోంది. అహ్మదాబాద్‌‌, జైపూర్‌‌ నగరాలను ఆర్గనైజర్స్‌‌ పరిశీలించినప్పటికీ బెంగళూరుకే ఓటేసినట్టు సమాచారం. ప్లేయర్లంతా వ్యాక్సిన్‌‌ వేయించుకోవడంతో పాటు సీజన్‌‌ మొదలయ్యే 14 రోజుల ముందే బెంగళూరుకు చేరుకొని బయో బబుల్‌‌లోకి వెళ్లేలా ఆర్గనైజర్స్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నారు. అంతకంటే ముందే అన్ని టీమ్స్‌‌  ప్రీ సీజన్‌‌ క్యాంప్‌‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి.