గండిపేట, వెలుగు: హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రి వర్సిటీలో పుట్టగొడుగుల సాగుపై పది రోజుల ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్లు అందించాలని కోరారు. వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్సైట్చూడాలని సూచించారు.
