తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా లింబాద్రి

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా లింబాద్రి

హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా కొనసాగుతున్న పాపిరెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియడంతో ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ లింబాద్రిని నియమిస్తూ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రొఫెసర్ లింబాద్రి చైర్మన్ గా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.