నెల్లూరు : స్పా సెంటర్ లో సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్న గుట్టును రట్టు చేశారు పోలీసులు. మసాజ్ పేరుతో సెక్స్ వర్కర్లతో నిర్వాహకులు వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం సెంటర్ పై ఆకస్మిక దాడులు చేశారు. వెంకటగిరికి చెందిన బి.ధనంజయరెడ్డి వ్యాపారం కోసం నెల్లూరుకు వచ్చాడు. మాగుంట లేఔట్ లోశివారు ప్రాంతంలో ఆరునెలల క్రితం స్టూడియో 11 అనే పేరుతో సెలూన్ అండ్ స్పాను పెట్టాడు. స్పాను ఎవ్వరికీ అనుమానం రాకుండా నిర్మించాడు. బెడ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాడు.
పలు ప్రాంతాల్లో నుంచి యువతులను తీసుకువచ్చి వారిచే కస్టమర్లకు మసాజ్ చేయించడం.. రేటు కుదిరితే వారిచే వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. రోజురోజుకి పెద్దసంఖ్యలో కస్టమర్లు రావడం మొదలైంది. డబ్బుల వ్యవహారం మొత్తం ఫోన్ లోనే జరిగేవి. ఈ విషయాలను బయటకు పొక్కకుండా నిర్వాహకుడు జాగ్రత్తపడ్డాడు. అయితే స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. స్పా సెంటర్ పై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు ఇద్దరు సెక్స్వర్కర్లు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
నిర్వాహకుడి ఫోన్ ను పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో యువతుల అశ్లీల చిత్రాలు, కస్టమర్ల ఫోన్ నంబర్లను గుర్తించారు. నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెక్స్ వర్కర్లను హోమ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.