
మాదాపూర్, వెలుగు: విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుల చెర నుంచి 9 మంది యువతులను రెస్క్యూ చేసి కాపాడారు. నిందితులను మాదాపూర్పోలీసులకు అప్పగించారు. మాదాపూర్పర్వత్నగర్లోని బీఎస్ఆర్సూపర్లగ్జరీ అండ్లివింగ్హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్ఏహెచ్టీయూ పోలీసులు గురువారం రైడ్ చేశారు.
ఈ రైడ్లో వెస్ట్బెంగాల్కు చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఇద్దరు, జార్ఖండ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు, ఉజ్బకిస్థాన్ దేశానికి చెందిన ఒకరు, తుర్కమినిస్థాన్దేశానికి చెందిన ఒక యువతి.. మొత్తంగా 9 మంది యువతులను రెస్క్యూ చేసి కాపాడారు. ఆర్గనైజర్హమీర్సింగ్, సూపర్వైజర్శ్రీనివాస్తో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకొని మాదాపూర్పోలీసులకు అప్పగించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల యువతులకు డబ్బుల ఆశ చూపించి హైదరాబాద్కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. లోకాంటో, స్కోక్కా వెబ్సైట్లలో ప్రకటనలు పోస్టు చేసి కాల్స్, వాట్సాప్ద్వారా హోటల్స్, ఓయో రూంలలో కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపింస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.