వ్యవసాయానికి చేయూత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “కేంద్రం అమలు చేస్తున్న ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనకు రైతుబంధు అమలు విధానాలు మార్గదర్శకం కావడం సంతోషం. కేంద్రం ప్రతిపాదిస్తున్న పలు పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు పునరుద్ధరించాం. నీతి అయోగ్ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సూచించినా కేంద్రం నిధులివ్వలేదు. మద్దతు ధరను కొన్ని పంటలకే పరిమితం చేయడంతో రైతులు నష్టపోతున్నారు, రాష్ట్రం మీద భారం పడుతోంది. అన్ని పంటలకూ మద్దతు ధర ఇవ్వాలి. ఆయిల్ పామ్ కు సహకరించాలి. వేరుశనగ ఉత్పత్తిలో పలుమార్లు జాతీయ రికార్డ్ సాధించాం. తెలంగాణలో వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేశాం. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం అందించాం” అని అన్నారు. సమావేశంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రికల్చర్ ఎక్స్ పోర్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ కమిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అంశాలపై చర్చించారు.
తెలంగాణకు చేయూత ఇవ్వండి
- దేశం
- July 9, 2019
లేటెస్ట్
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
- Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్ బ్యాక్ ఇండియన్' వినేది ఎప్పుడంటే?
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి