హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన దొంగలు

హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన దొంగలు
  • అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్​ బాటసింగారంలో హల్ చల్
  • బంగారం, వెండి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

ఎల్​బీ నగర్, వెలుగు:  ఒకే ఊరిలో తొమ్మిది ఇండ్లలో దొంగలు నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్​ పరిధిలోని బాటసింగారంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఊరిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్​గా చేసుకుని, పక్కిండ్లకు గడియలు పెట్టారు. ఎవరూ లేని తొమ్మిది ఇండ్లలో సుమారు 84 తులాల వెండి, 5 తులాల గోల్డ్, 30వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో డాగ్​స్వ్కాడ్, క్లూస్​ టీమ్​తో వెళ్లారు.  ఎల్​బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి వెళ్లి పరిశీలించారు. సీసీ‌‌ఎస్, ఎస్​ఓటీ , క్రైమ్ పోలీసులతో ఆరు ప్రత్యేక టీమ్​లతో దర్యాప్తు చేపట్టారు.