- అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ బాటసింగారంలో హల్ చల్
- బంగారం, వెండి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
ఎల్బీ నగర్, వెలుగు: ఒకే ఊరిలో తొమ్మిది ఇండ్లలో దొంగలు నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని బాటసింగారంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఊరిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్గా చేసుకుని, పక్కిండ్లకు గడియలు పెట్టారు. ఎవరూ లేని తొమ్మిది ఇండ్లలో సుమారు 84 తులాల వెండి, 5 తులాల గోల్డ్, 30వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో డాగ్స్వ్కాడ్, క్లూస్ టీమ్తో వెళ్లారు. ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, క్రైమ్ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి వెళ్లి పరిశీలించారు. సీసీఎస్, ఎస్ఓటీ , క్రైమ్ పోలీసులతో ఆరు ప్రత్యేక టీమ్లతో దర్యాప్తు చేపట్టారు.