- కెరీర్ ఎంపికలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనోగతం
- రాష్ట్రంలోని మోడల్స్కూల్స్లో నిర్వహించిన సర్వేలో వెల్లడి
- 194 స్కూళ్లలో 18 వేల మంది టెన్త్ స్టూడెంట్స్పై స్టడీ
హైదరాబాద్, వెలుగు:
పిల్లలు హైస్కూల్స్థాయి నుంచే తమ కెరీర్ఎంపికపై ఫోకస్ పెడుతున్నారు. స్థానిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. ‘మై చాయిస్ మై ఫ్యూచర్’ పేరుతో రాష్ర్టంలోని మోడల్ స్కూళ్లలో నిర్వహించిన సైకోమెట్రిక్ టెస్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలు ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ రంగంలో స్థిరపడేందుకు మొగ్గుచూపగా.. అబ్బాయిలు పోలీస్ కావాలనే కోరికను వ్యక్తపరిచారు. ఐటీ జాబ్స్వైపు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఒక్కో జిల్లా స్టూడెంట్లు ఒక్కోరకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
18 వేల మందికి సైకోమెట్రిక్టెస్ట్
రాష్ర్టంలో 27 జిల్లాల్లో 194 మోడల్ స్కూల్స్ఉన్నాయి. వీటిలో స్టూడెంట్ల కెరీర్ గైడెన్స్ కోసం రెండు నెలల క్రితం బోధ్ బ్రిడ్జ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థతో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టూడెంట్స్ మనోగతంతోపాటు వారిలో కెరీర్పై అవగాహన పెంచేందుకు మై చాయిస్ మై ఫ్యూచర్(ఎంసీఎంఎఫ్) అనే ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేవలం మోడల్ స్కూల్స్లోని పదో తరగతి స్టూడెంట్స్ను ఎంచుకుంది. అన్ని జిల్లాల పరిధిలోని 18 వేల మంది స్టూడెంట్లకు ఆన్లైన్లో సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహించింది. రెండు నెలలపాటు సాగిన ఈ ప్రోగ్రామ్లో 200 మంది టీచర్లకూ కెరీర్ గైడెన్స్పై శిక్షణ ఇచ్చారు. వారంతా ఫస్ట్ లెవెల్ కౌన్సెలర్లుగా విధులు నిర్వహించారు.
72 అంశాలతో సర్వే
మొత్తం 72 అంశాలతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఓవరాల్గా అగ్రికల్చర్ అండ్ ఫుడ్, పోలీస్ విభాగాల్లో పనిచేసేందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆసక్తి చూపించారు. అమ్మాయిలు మెజార్టీగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్, మెడికల్ హెల్త్కేర్ జాబ్స్కు, అబ్బాయిలు పోలీస్, అగ్రికల్చర్ జాబ్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కుటుంబ నేపథ్యమూ కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 9 శాతం మంది మాత్రమే ఐటీ జాబ్స్చేస్తామని, 11 శాతం మంది తామే కొత్త పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని చెప్తున్న వారిలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు.
రిస్క్ చేసేందుకు వెనుకంజ
కెరీర్లో రిస్క్చేసేందుకు స్టూడెంట్స్పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వంద మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆ సాహసం చేసేందుకు ముందుకు రాగా, మరో 37 శాతం చూద్దామని, 61 శాతం మంది ఆ జోలికేపోమని పేర్కొన్నారు. దీంతో పాటు స్టూడెంట్స్ స్వతంత్రంగా ఉండేందుకూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం 8 శాతం మంది మాత్రమే ఇండిపెండెంట్గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
కొన్ని జిల్లాల్లో ఇలా..
ఆదిలాబాద్లో ఎన్విరాన్మెంటల్ సర్వీస్, మార్కెటింగ్, పారామెడికల్ చేసేందుకు అబ్బాయిలు ముందుకు రాగా, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, సేల్స్, ఆర్ట్స్ డిజైన్, జర్నలిజం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు అమ్మాయిలు చెప్పారు. కరీంనగర్లో అమ్మాయిలు మార్కెటింగ్వైపు, అబ్బాయిలు పారామెడికల్, సేల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మంలో సంస్థలు పెట్టేందుకు, హాస్పిటాలిటీ, టూరిజం వైపు అబ్బాయిలు, ఆర్ట్ డిజైన్, లా, హ్యూమన్ సర్వీస్, జర్నలిజం, ఫైనాన్స్ రంగాలవైపు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబ్నగర్లో మార్కెటింగ్, లా, ఎడ్యుకేషన్ అండ్ట్రైనింగ్ లాంటి జాబ్స్చేసేందుకు అమ్మాయిలు, ఆర్కిటెక్చర్, పారామెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్అండ్ అడ్మినిస్ర్టేషన్ రంగాల వైపు అబ్బాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. నిజామాబాద్లో సంస్థలు పెట్టేందుకు, డిఫెన్స్లో చేరేందుకు అబ్బాయిలు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మెడిసిన్ అండ్ హెల్త్కేర్ రంగంవైపు వెళ్లేందుకు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించారు.

టాప్ 5 కెరీర్ లిస్టులు
అమ్మాయిల ప్రయారిటీ ఇలా..
అగ్రికల్చర్ అండ్ ఫుడ్ (20%)
మెడిసిన్ అండ్ హెల్త్కేర్ (17%)
పోలిస్ (12%)
ఐటీ (8%)
గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (7%)
అబ్బాయిల ప్రయారిటీ ఇలా..
పోలిస్ (27%)
అగ్రికల్చర్ అండ్ ఫుడ్ (15%)
ఐటీ (11%)
స్పోర్ట్స్(9%)
డిఫెన్స్ (7%)
