- దళిత, బీసీ, ప్రజా సంఘాల నేతలు
- వికారాబాద్ జిల్లా కులకచర్లలో రోడ్డుపై నిరసన
- మద్దతు తెలిపిన విపక్ష పార్టీలు
పరిగి, వెలుగు: ఎమ్మెల్యే అనుచరులకే దళిత, బీసీ బంధును ఇస్తున్నారని దళిత, బీసీ, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్లలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, దళిత, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలకే పథకాలు ఇస్తున్నారని, బీసీ బంధు, దళిత బంధులో రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
అర్హులకు ఇవ్వాలని లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనాపూర్ వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, బీజేపీ మండల అధ్యక్షుడు గాదె మహిపాల్, బీజేవైఎం అధ్యక్షుడు గడుసు మహిపాల్ మహేశ్, పరిగి పరిరక్షణ సమితి సభ్యులు హరికృష్ణ, యూత్ కాంగ్రెస్ నేతలు నాగవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.