హుస్సేన్​సాగర్​లోనే నిమజ్జనం చేస్తం.. నిర్వాహకుల ఆందోళన​

హుస్సేన్​సాగర్​లోనే నిమజ్జనం చేస్తం..   నిర్వాహకుల ఆందోళన​

ముషీరాబాద్,వెలుగు : వినాయక నిమజ్జనంపై హైకోర్టు తీర్పునకు నిరసనగా సోమవారం రాత్రి హైదరాబాద్​ ట్యాంక్ బండ్​పై మండపాల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి నిర్వాహకులతో మాట్లాడారు. హై కోర్టు ఆర్డర్ ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. 

మండప నిర్వాహకులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్, నవీన్ గౌడ్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, లింగం గౌడ్ మాట్లాడుతూ ...70 ఏళ్లుగా ట్యాంక్ బండ్​లోనే గణేశ్ ​నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. హిందూ పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు.  గతేడాది నుంచి నిమజ్జనంపై నిర్వాహకులను, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.