వారిని పదవుల నుంచి తొలగించాలి

వారిని పదవుల నుంచి తొలగించాలి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఘటనపై పాత బస్తీ ముస్లిం మత పెద్ద, ఆలిండియా సూఫీ ఉలెమా కౌన్సిల్ అధ్యక్షులు ఖైరుద్దీన్ సూఫీ స్పందించారు. ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. సిటీలో పబ్లు, క్లబ్లు బంద్ చేయించాలని ఆయన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అంతేకాదు.. ముస్లింలకు అత్యంత పవిత్రమైన వక్ఫ్ బోర్డు పదవిలో ఉన్న మసీ ఉల్లాఖాన్ వంటి వారిని వెంటనే పదవుల నుంచి  తొలగించాలన్నారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం పరువు పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిటీకి, ప్రజల గౌరవానికి భంగం కలగకుండా ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఖైరుద్దీన్ సూఫీ అభిప్రాయపడ్డారు.

 

 

ఇవి కూడా చదవండి

బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా.. పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ

సివిల్స్ పాసయ్యానని సంతోషం.. అంతలోనే షాకింగ్ న్యూస్