ఉగ్రదాడిలో చనిపోయినవారి సంఖ్య 42కి చేరింది. పుల్వామా దాడిని దేశం మొత్తం ఖండిస్తుంది. అమరులైన వీర జవాన్లకు పలువురు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు వారి స్వస్థలాల్లో జోహార్లు కొడుతున్నారు. ఇంకోవైపు కుటుంబాలను ఓదారుస్తున్నారు. చనిపోయిన 42 సైనికులు 35 ఏళ్ల లోపు వయసు వారే. చాలా మందికి చిన్న పిల్లలున్నారు. కొన్ని రోజుల్లో సెలవులు ఉన్నాయి. వస్తున్నా… లోన్ తీసుకుని ఇళ్లు కట్టుకుందాం.. ఇది ఓ జవాన్ తన భార్యకు చివరగా చెప్పిన మాట.
పిల్లలను బాగా చూసుకో… మళ్లీ వస్తాను అంటూ సెలవులు ముగించుకుని వెళ్తూ వెళ్తూ తన భార్యకు మరో జవాన్ చెప్పిన మాట. అవే వారి ఆఖరి మాటలు అయ్యాయి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధిత కుటుంబాలు రోదిస్తుండడం అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
Maharajganj: Family of CRPF personnel Pankaj Tripathi who lost his life in #PulwamaTerrorAttack yesterday, in mourning. pic.twitter.com/Pw9cNLpRPw
— ANI UP (@ANINewsUP) February 15, 2019