లోక్ సభలో రచ్చలేపిన అజాంఖన్ వ్యాఖ్యలు

లోక్ సభలో రచ్చలేపిన అజాంఖన్ వ్యాఖ్యలు

సమాజ్ వాద్ ఎంపీ అజంఖాన్ వ్యాఖ్యలపై  లోక్ సభలో  దుమారం రేగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన అజంఖాన్ క్షమాపణలు చెప్పాలని మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజంఖాన్ క్షమాపణలు చెప్పకపోతే అతన్ని సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అజంఖాన్ వ్యాఖ్యలను తప్పబట్టారు. లోక్ సభల ో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై చర్చ సందర్భంలో డిప్యూటీ స్పీకర్ ను ఉద్దేశించి మీ కళ్లల్లోకి కళ్లు పెట్టి మాట్లాడాలని ఉందంటూ అజంఖాన్ వ్యాఖ్యానించారు.దీనిపై అన్ని వైపుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.